జీవో 60 ప్రకారం జీతాలు ఇవ్వాలి... మంత్రి వివేక్ను కోరిన వాటర్ బోర్డు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు

జీవో 60 ప్రకారం జీతాలు ఇవ్వాలి... మంత్రి వివేక్ను కోరిన వాటర్ బోర్డు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఔట్​సోర్సింగ్​ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆల్​ఇండియా కాన్ఫడరేషన్​ఆఫ్​ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్​సంఘాల సమాఖ్య అధ్యక్షుడు మహేశ్వర్​రాజ్ కోరారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామిని గ్రేటర్​ హైదరాబాద్​ మెట్రోవాటర్​సప్లయ్​ అండ్​ సివరేజీ బోర్డు ఔట్​సోర్సింగ్ ఉద్యోగులు కలిశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. 

2021లో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 60 ప్రకారం జీహెచ్ఎంసీ ఔట్​సోర్సింగ్ ఎంప్లాయీస్​కు జీతాలు ఇస్తున్నారని, తమకూ అలాగే ఇవ్వాలన్నారు. వాటర్​బోర్డు ఎండీగా దానకిశోర్​ఉన్నప్పుడు రికమెండ్​చేసినా ఇప్పటి వరకు ఇవ్వడం లేదన్నారు. ఔట్​ సోర్సింగ్​ ఎంప్లాయీస్​ ఎన్నో కష్టాలు పడుతూ పని చేస్తున్నారని, వారికి తగిన న్యాయం చేయాలని కోరారు.