
- గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నట్లు తెలిసింది
- ఎస్ఎంఎస్లు కూడా చేస్తున్నరు
హైదరాబాద్సిటీ, వెలుగు: నీటి వినియోగదారులకు కొందరు అజ్ఞాత వ్యక్తులు గుర్తుతెలియని మొబైల్ నెంబర్ల నుంచి ఫోన్చేసి వాటర్బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని బెదిరిస్తున్నారని, వాటర్బోర్డు నుంచి కాకుండా వేరే నంబర్లతో ఎస్ఎంఎస్లు చేస్తూ మోసం చేస్తున్నారని వాటర్బోర్డు తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో వినియోగదారులు అలర్ట్గా ఉండాలని, అలాంటి మెసేజ్లకు స్పందించకూడదని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
‘ఈ రాత్రి 9:30 గంటల్లోపు గతనెల బిల్లు చెల్లించకపోతే మీ నల్లా కనెక్షన్ తొలగిస్తాం’ అంటూ 84271 56645 నంబర్నుంచి కొందరు కస్టమర్లకు మెసేజ్ లు వెళ్లాయని, వివరాలకోసం 90649 53421 నంబర్ను సంప్రదించాలని కోరారని స్పష్టం చేసింది. ఆ నెంబర్ను సంప్రదిస్తే ప్రాసెసింగ్ కోసమని ఏపీకే ఫైల్ వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారని చెప్పింది.
ఇది డౌన్లోడ్చేసుకుంటే అకౌంట్లలో ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేస్తారని హెచ్చరించింది. ఈ విషయంలో ఏవైనా సమస్యలు ఉన్నా, ఇతర వివరాలకు కస్టమర్ కేర్ 155313కి సంప్రదించాలని వాటర్బోర్డు అధికారులు కోరారు.