వాటర్​ బిల్లు కట్టమని ఎవరైనా ఫోన్​ చేస్తే నమ్మొద్దు.. వాటర్​బోర్డు హెచ్చరిక

వాటర్​ బిల్లు కట్టమని ఎవరైనా ఫోన్​ చేస్తే నమ్మొద్దు.. వాటర్​బోర్డు హెచ్చరిక
  • గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నట్లు తెలిసింది
  • ఎస్ఎంఎస్​లు కూడా చేస్తున్నరు

హైదరాబాద్​సిటీ, వెలుగు: నీటి వినియోగదారులకు కొంద‌‌రు అజ్ఞాత వ్యక్తులు గుర్తుతెలియ‌‌ని మొబైల్‌‌ నెంబ‌‌ర్ల నుంచి ఫోన్​చేసి వాటర్​బిల్లు చెల్లించ‌‌కుంటే క‌‌నెక్షన్ తొల‌‌గిస్తామ‌‌ని బెదిరిస్తున్నారని, వాటర్​బోర్డు నుంచి కాకుండా వేరే నంబర్లతో ఎస్ఎంఎస్​లు చేస్తూ మోసం చేస్తున్నారని వాటర్​బోర్డు తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో వినియోగదారులు అలర్ట్​గా ఉండాలని, అలాంటి మెసేజ్‌‌ల‌‌కు స్పందించ‌‌కూడ‌‌దని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. 

‘ఈ రాత్రి 9:30 గంటల్లోపు గ‌‌త‌‌నెల బిల్లు చెల్లించ‌‌క‌‌పోతే మీ న‌‌ల్లా క‌‌నెక్షన్‌‌ తొలగిస్తాం’ అంటూ 84271 56645 నంబర్​నుంచి కొందరు కస్టమర్లకు మెసేజ్ లు వెళ్లాయని, వివ‌‌రాల‌‌కోసం 90649 53421 నంబర్​ను సంప్రదించాలని కోరారని స్పష్టం చేసింది. ఆ నెంబ‌‌ర్‌‌ను సంప్రదిస్తే ప్రాసెసింగ్ కోస‌‌మ‌‌ని ఏపీకే ఫైల్‌‌ వాట్సాప్‌‌ ద్వారా పంపిస్తున్నారని చెప్పింది. 

ఇది డౌన్​లోడ్​చేసుకుంటే అకౌంట్లలో ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేస్తారని హెచ్చరించింది. ఈ విష‌‌యంలో ఏవైనా స‌‌మ‌‌స్యలు ఉన్నా, ఇతర వివరాలకు క‌‌స్టమ‌‌ర్ కేర్ 155313కి సంప్రదించాల‌‌ని వాటర్​బోర్డు అధికారులు కోరారు.