గడువుకు ముందే హైవే పూర్తి చేస్తం: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి

గడువుకు ముందే హైవే పూర్తి చేస్తం: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి

చేవెళ్ల, వెలుగు: బీజాపూర్​ హైవే పనులకు ఏడాదిన్నర గడువు ఉన్నా.. 9 నెలల్లో పూర్తి చేస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్​రెడ్డి చెప్పారు. రోడ్డు కాంట్రాక్టర్​ మెగా కృష్ణారెడ్డితో మాట్లాడి నాలుగు బ్యాచ్​లుగా పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. గురువారం చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, తాండూర్​ ఎమ్మెల్యే మనోహర్​ రెడ్డి, కాంగ్రెస్​ కొడంగల్​ నియోజకవర్గ ఇన్​చార్జి ఎనుముల తిరుపతి రెడ్డితో కలిసి ప్రెస్ మీట్​ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​, బీజేపీలు ఈ రోడ్డును పట్టించుకోకపోవడం పనులు లేటయ్యాయన్నారు. సీఎం రేవంత్​రెడ్డి చొరవతో ఇప్పుడు పనులు స్పీడప్​ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు మెంబర్​ చింపుల సత్యనారాయణరెడ్డి,  పీఏసీఎస్​ చైర్మన్లు గోపె ప్రతాప్​ రెడ్డి, దేవర వెంకట్​రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు ఆగిరెడ్డి, పడాల రాములు పాల్గొన్నారు.