బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ గులాబీ యూనిఫాం వేసుకున్న పోలీసులను తప్పక నిలదీస్తామని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హెచ్చరించారు. ఎన్నికల సన్నాహాలపై బీజేపీ నిర్వహించిన సమావేశంలో రఘునందనరావు మాట్లాడారు. ప్రస్తుతం మేము చీకటిలో ఉండొచ్చు… చీకట్లు పోయి వెలుతురులోకి వస్తాం.. తప్పు చేస్తున్న పోలీస్ అధికారులకు శిక్ష తప్పదని గుర్తుంచుకోవాలని సూచించారు. పోలీస్ కమిషనర్లు చట్టాలకు అతీతం కాదన్నారు. భూమి గుండ్రంగా ఉందన్న విషయం పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాలి.. హైదరాబాద్, రాచకొండ, సిద్దిపేట పోలీస్ కమిషనర్లు ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడమే పోలీస్ అధికారుల ఉద్దేశమా? అని ఆయన ప్రశ్నించారు.
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు సైతం దుబ్బాక తీర్పును ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మధ్య తాను దుబ్బాక నియోజకవర్గాన్ని గెలవటం చిన్న విషయం కాదన్నారు. ఉద్యమాల గడ్డపై జైశ్రీరాం నినాదాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కారుకు ఓటు వేస్తే.. ఎంఐఎంకు వేసినట్లే.. ఎందుకంటే టీఆర్ఎస్ కారు స్టీరింగ్ అసదుద్ధీన్ చేతిలో ఉందని రఘునందన్ రావు విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గానికి కేంద్రం నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని ఆరోపించారు.
Read more news
మనస్పర్థలతో ఫ్రెండ్స్ మధ్య గ్యాప్.. ఈ గ్యాప్ రావొద్దంటే..