మమ్మల్నే విమర్శిస్తారా..గుర్తుపెట్టుకుంటాం:సోనియాతో మమత

మమ్మల్నే విమర్శిస్తారా..గుర్తుపెట్టుకుంటాం:సోనియాతో మమత

ఢిల్లీ : యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇవాళ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఎదురుపడ్డారు. ఫేస్ 2 ఫేస్ కలిసిన సందర్భంలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అంతకుముందు లోక్ సభలో “అన్ రెగ్యులేటెడ్ స్కీమ్స్, చిట్ ఫండ్స్” అంశంపై జరిగిన చర్చ సందర్భంగా.. శారదా చిట్ ఫండ్ స్కామ్ విషయంలో వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై… ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ, కీలక నాయకుడు అయిన ఆధిర్ రంజన్ చౌదరి విమర్శలు చేశారు. శారదా చిట్స్ స్కామ్ లో సీఎం మమతా బెనర్జీకి కూడా పాత్ర ఉంది అని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ ఈ విమర్శలు చేసినప్పుడు బీజేపీ ఎంపీలు సభలో మద్దతు తెలిపారు.

ఈ విషయాన్ని సోనియా ఎదురుపడినప్పుడు మమతా బెనర్జీ గుర్తుచేశారు. “సభలో మమ్మల్ని విమర్శించారు. ఈ విషయం గుర్తుపెట్టుకుంటాం” అని అన్నారు. “ఒకరినొకరం నిందిచుంకుంటాం కానీ.. మనం మిత్రపక్షాలమే” అని సోనియాగాంధీ చెప్పారు.

ఆ తర్వాత.. ఢిల్లీలో ఆప్ ఆధ్వర్యంలో జరిగిన సభలోనూ వెస్ట్ బెంగాల్ లో కాంగ్రెస్ తో దోస్తీ ఉండదని మమతా బెనర్జీ సంకేతాలు ఇచ్చారు.