నీరా పాలసీ ప్రకటించి గీత కార్మికులకు అండగా నిలుస్తున్నరు

నీరా పాలసీ ప్రకటించి గీత కార్మికులకు అండగా నిలుస్తున్నరు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మద్దతిస్తామని గౌడ సంఘాల నాయకులు తెలిపారు. శనివారం బేగంపేట క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రులు కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి మద్దతు ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన గీత వృత్తిని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదుకున్నారని, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కల్లు దుకాణాలు తెరిపించడంతో పాటు కల్లు దుకాణాల లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల బకాయిలు రూ.16 కోట్లు రద్దు చేశారని, నీరా పాలసీ ప్రకటించి గీత కార్మికులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు.

వైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపుల కేటాయింపుల్లోనూ 15 శాతం రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్పించారని, సర్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వాయి పాపన్న గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారని అన్నారు. గౌడల ఆత్మగౌరవానికి కృషి చేస్తున్న కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకత్వానికి తాము అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాలరాజు గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెంకన్నగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వేములయ్య, నారాయణ, విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజయ్య, యాదగిరి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.