
ముంబై: ఈ వారం మార్కెట్ డైరెక్షన్ను గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్, యూఎస్, ఇండియా ద్రవ్యోల్బణం డేటా (జూన్ 11, 12న ), విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కదలికలు నిర్ణయిస్తాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. వర్షాలు, యూఎస్–చైనా, యూఎస్– ఇండియా ట్రేడ్ చర్చలను కూడా ట్రేడర్లు గమనిస్తారని అన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటి వరకు నికరంగా రూ.8,749 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. “మార్కెట్ పార్టిసిపెంట్స్ ఈ వారం కీలక మాక్రోఎకనామిక్ డేటాపై ఫోకస్ చేస్తారు.
ద్రవ్యోల్బణం డేటా బట్టి ఫెడ్ తీసుకునే పాలసీ నిర్ణయాన్ని అంచనా వేస్తారు. వర్షాకాలం పురోగతి, విత్తనాల విధానం గ్రామీణ వినియోగంపై ప్రభావం చూపుతాయి కాబట్టి వీటిని కూడా మానిటర్ చేస్తారు” అని ఎనలిస్టులు పేర్కొన్నారు. గ్లోబల్గా చూస్తే ట్రేడ్ చర్చలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ను ప్రభావితం చేస్తాయని అన్నారు. ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో బెంచ్మార్క్ ఇండెక్స్లు సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం ఒక శాతం పెరిగాయి.