ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌డీసీతో కలిసి టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌లో వెల్‌‌‌‌‌‌‌‌స్పన్‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌

ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌డీసీతో కలిసి టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌లో వెల్‌‌‌‌‌‌‌‌స్పన్‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: హోమ్ టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్స్ (టవల్స్​ వంటివి) తయారీ కంపెనీ వెల్‌‌‌‌‌‌‌‌స్పన్ లివింగ్ లిమిటెడ్ గురువారం నేషనల్ స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌డీసీ)తో ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రకటించింది. ఈ ఒప్పందం కింద  వెల్‌‌‌‌‌‌‌‌స్పన్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో   టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఆపరేటర్ లెవల్ పనులపై ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇస్తారు. వీరికి కంపెనీలో ఉద్యోగాలు కూడా దొరుకుతాయి.  

పైలెట్ ఫేజ్‌‌‌‌‌‌‌‌లో వెయ్యి మంది క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌కు  ట్రైనింగ్, సర్టిఫికేషన్ ఇస్తారు.  వీరిలో కనీసం 50శాతం మహిళలు ఉంటారు.  ముఖ్యంగా నార్త్-ఈస్టర్న్ స్టేట్స్, ఉత్తరాఖండ్ లాంటి వెనుకబడిన రాష్ట్రాల వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ ప్రోగ్రామ్ కోసం మొత్తం రూ. 4.25 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్ గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని వెల్‌‌‌‌‌‌‌‌స్పన్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో జరుగుతుంది. 

క్లాస్‌‌‌‌‌‌‌‌రూమ్ ట్రైనింగ్, ఆన్- ది- జాబ్ ట్రైనింగ్ కలిపి, మెషీన్ హ్యాండ్లింగ్, ప్రొడక్షన్ ప్రాసెసెస్, క్వాలిటీ కంట్రోల్, సేఫ్టీ ప్రోటోకాల్స్, సాఫ్ట్ స్కిల్స్ వంటి కీలక టెక్నికల్ ఏరియాల్లో ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసినవాళ్లకి ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌డీసీ, వెల్‌‌‌‌‌‌‌‌స్పన్ నుంచి జాయింట్ సర్టిఫికేషన్, వెల్‌‌‌‌‌‌‌‌స్పన్ టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌లో జాబ్‌‌‌‌‌‌‌‌ లభిస్తుంది. “స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ అంటే కేవలం ఉద్యోగాలు కాదు, అవకాశాలు సృష్టించడం, తమ భవిష్యత్‌‌‌‌‌‌‌‌ను మార్చుకోవడంలో ప్రజల సామర్ధ్యాలు పెంచడం. 

ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌డీసీతో మా కొలాబరేషన్ ద్వారా అందరిని కలుపుకుంటూ, భవిష్యత్‌‌‌‌‌‌‌‌ అవసరాల కోసం  టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ వర్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ను  సృష్టిస్తాం” అని వెల్‌‌‌‌‌‌‌‌స్పన్ లివింగ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ రాజేష్ జైన్ చెప్పారు.