ఉప్పల్​కు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? : బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఉప్పల్​కు ఇచ్చిన  హామీలు ఏమయ్యాయి? : బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ వేదికగా ఉప్పల్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని మంత్రి కేటీఆర్​ను బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. ఉప్పల్ స్కై వే ఓపెనింగ్ పోగ్రామ్ లో కేటీఆర్ రాజకీయాలు మాట్లాడటమేంటని నిలదీశారు. మంగళవారం ఆయన పార్టీ రాష్ర్ట కార్యాలయంలో  మీడియాతో మాట్లాడారు. ఉప్పల్ లో కేటీఆర్ పర్యటనను పబ్లిక్ అడ్డుకున్నరని ప్రభాకర్ తెలిపారు.

ప్రజలే నల్ల బెలూన్లు ఎగురవేశారని, వ్యాపారులు స్వతహాగా బంద్ పాటించారని వివరించారు. ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేసినా బీజేపీ నేతలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఉప్పల్ లో నేషనల్ హైవే ఫ్లై ఓవర్ నిర్మాణం లేట్ అయ్యిందని ప్రభాకర్ పేర్కొన్నారు.