
భారత్-పాక్ యుద్దం ఎందుకు ఆపారో చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. ట్రంప్ ఫోన్ కు మోదీ ప్రభుత్వం భయపడిందన్నారు. భారత్- పాక్ యుద్ధం మధ్యలో ట్రంప్ ఎవరు అని ప్రశ్నించారు. యుద్ధానికి తాము సంపూర్ణ మద్దతిచ్చామని చెప్పారు. యుద్దం వాస్తవాలేంటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం కేంద్రంపైన ఉందన్నారు. రాహుల్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.
గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్..మోదీకి, ఇందిరా గాంధీకి పోలికేంటి.? ఇందిరా యుద్ధం చేసిన తీరేంటి.?మీరు చేసిన తీరేంటి.? సర్జికల్ స్ట్రైక్ అంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఇందిర కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్ లు చేసింది. కాంగ్రెస్ ఎప్పుడు బహిరంగంగా గొప్పలు చెప్పుకోలేదు. యుద్దం వల్ల ఏం సాధించారు ఏం కోల్పోయారో చెప్పాలని ప్రశ్నించారు.
►ALSO READ | విలీనం కాదు కదా.. కనీసం పొత్తు కూడా ఉండదు: బీజేపీ, BRS విలీనంపై జగదీష్ రెడ్డి క్లారిటీ
కేసీఆర్, కిషన్ రెడ్డి కలయిక వల్లే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. మీ కలయిక ఏంటో రాజాసింగ్ చెప్పడం లేదా? బీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన నేతలెవరో రాజాసింగ్ చెబుతున్నారు. ముందు కవిత, రాజాసింగ్ ప్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానంచెప్పాలి. కులగణన చేయాలంటే దమ్ముండాలి. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, ఎందుకు స్పందించరు.? కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల వాస్తవాలు చెప్పాలి. దొంగలుదొంగలు ఊర్లు పంచుకున్నట్లు చేశారు. పదేండ్లు దోచుకున్నసొమ్మే బీఆర్ఎస్ లో గొడవలకు దారితీసింది. ప్రతి పార్టీలో కోవర్టులు ఉంటారు అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.