విదేశీ విద్యార్ధులకు ట్రంప్ సర్కార్ ఊరట

విదేశీ విద్యార్ధులకు ట్రంప్ సర్కార్ ఊరట

వాషింగ్టన్: అమెరికాలో కరోనా విపత్తువల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇండియా సహా వివిధ దేశాల  స్టూడెంట్లకు ట్రంప్ సర్కారు ఊరట నిచ్చింది. ఆఫ్ క్యాంపస్ వర్క్ కోసం అనుమతి పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గత కొన్ని వారాలుగా క్యాంపస్ లు మూతపడటం, రూంలు ఖాళీ చేయాల్సి రావడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న వేలాది మంది స్టూడెంట్లకు ఇది పెద్ద ఉప శమనం కానుంది. ‘‘మీ ప్రమేయం లేకుండా, అనూహ్యంగా ఆర్థిక కష్టాల పాలైన విదేశీ స్టూడెంట్లు ఈ అవకాశం వినియోగించుకోవచ్చు’’ అని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. అప్లికేష న్లను ఒక్కో దాన్ని పరిశీలించి, తగిన కారణాలు ఉన్నాయని భావిస్తేనే ఆఫ్ క్యాంపస్ వర్క్ ఆథరైజేషన్ కు ఆమోదం లభిస్తుందని యూఎస్సీఐ ఎస్ పేర్కొంది. ట్యూషన్ ఫీజులు లేదా లివింగ్ కాస్ట్ అనుకోకుండా పెరగడం, అనూహ్యం గా ఆర్థికర్థి సాయాన్ని కోల్పోవడం, గతంలో లేనటు వంటి కొత్త పరిస్థితులు లేదా యుద్ధం , విపత్తుల కారణంగా ఆర్థిక ఇబ్ ర్థి బందుల్లో పడటం, మెడికల్ బిల్లులు భారీగా పెరగడం, మార్చి 13న వైట్ హౌస్‌ సోషల్ మిటిగేషన్ మెజర్స్ ప్రకటించిన తర్వాత విద్యా సంస్థ ల మూసివేత వల్ల కష్టాలు ఎదుర్కోవడం వంటి కారణాలను ఆఫ్ క్యాంపస్ వర్క్ కు అనుమతించేందుకు పరిగణనలోకి తీసుకుంటామని యూఎస్సీఐఎస్వి  వివరించింది. అమెరికాలో దాదాపు 2.50 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్ లు చదువుతున్నట్లు అంచనా. వీరిలో చాలామంది మన దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించ డానికన్నా ముందే వచ్చేశారు.