నటి గాయత్రి జోషి భర్త.. కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డాడు

నటి గాయత్రి జోషి భర్త.. కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డాడు

నటి గాయత్రి జోషి భర్త వికాస్ ఒబెరాయ్ కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ జంట ఇటలీలో ఉంది. అక్కడ వారు ప్రయాణిస్తున్న లంబోర్ఘిని   కారు ప్రమాదానికి గురైంది. వెకేషన్ లో భాగంగా ఓల్బియా నుండి  టెయులాడా వెళ్తుండగా వీరి కారుని మరో ఫెరారీ కారును, క్యాంపర్ వ్యాన్   ఢీ కొట్టింది. 

దీంతో క్యాంపర్ వ్యాన్   బోల్తా పడగా,  ఫెరారీ కారులో మంటలు చెలరేగి ఇద్దరు మరణించారు.  కానీ  గాయత్రి, వికాస్‌లకు స్వల్ప గాయాలై  క్షేమంగా ప్రాణాలతో బలటపడ్డారు.   " వికాస్, నేను ఇటలీలో ఉన్నాము. మేము ఇక్కడ ప్రమాదానికి గురయ్యాము. దేవుడి దయతో, మేమిద్దరం పూర్తిగా క్షేమంగా ఉన్నాము" అని గ్రాయత్రి వెల్లడించింది.  

Also Read :- మొబైల్ ఫోన్ల తయారీలో వరల్డ్ టాప్ 2 భారత్

గాయత్రి జోషి గురించి
 
1977 మార్చి 20న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించింది. 2000లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్‌ని కైవసం చేసుకుంది.  అశుతోష్  గోవారికర్ స్వదేస్ మూవీతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.  ఇందులో ఆమె నటనకు గానూ  ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తరువాత  గాయత్రి జోషి సినీ పరిశ్రమకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది . తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టింది.