హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాలను చుట్టేస్తున్నా, ఆయన వెంట ఎప్పుడూ ఉండే ఎంపీ సంతోష్కుమార్ ఎక్కడా కనిపించడం లేదు. గతంలో కేసీఆర్ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట సంతోష్ తప్పనిసరిగా ఉండేవారు. ఢిల్లీకి వెళ్లినా ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లినా.. జిల్లాల టూర్కు వెళ్లినా కేసీఆర్తో పాటే ఉండేవారు. కానీ కొన్నాళ్లుగా ఆయన ఎవరికీ కనిపించడం లేదు.
సీఎం కేసీఆర్ కుటుంబంలో తలెత్తిన విభేదాలతో ఆయన కొన్ని రోజులకు ప్రగతి భవన్కు దూరంగా ఉన్నారని గతంలో ప్రచారం జరిగింది. తర్వాత ఆయన మళ్లీ ప్రగతి భవన్లో ప్రత్యక్షమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంతోశ్ ప్రమేయం అంతగా లేదనే ప్రచారం జరుగుతోంది. బేగంపేట క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా నిర్వహిస్తున్న వార్ రూమ్లలోనూ ఆయన పాత్ర లేదని తెలుస్తోంది. అసలు సంతోష్ కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటీ అనేదానిపై బీఆర్ఎస్నేతల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.