కేటీఆర్ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతది : వివేక్

కేటీఆర్ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతది : వివేక్

టీఆర్ఎస్పై ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉందో దుబ్బాక, జీహెచ్ఎంసీ, మునుగోడు ఎన్నికలతో తేలిందని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. టీఆర్ఎస్ను ప్రజలు నమ్మేస్థితిలో లేరని.. గత 8ఏళ్లుగా మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం, లిక్కర్, క్యాసినో అవినీతిలో  టీఆర్ఎస్ మునిగిపోయిందని ఆరోపించారు.

కేటీఆర్ ఓ ఫెయిల్యూర్ లీడర్ అని..కేటీఆర్ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందన్నారు. టీఆర్ఎస్ నాయకత్వం మొత్తం మునుగోడులో ప్రచారం చేసినా..కేవలం 10వేల మెజారిటీ రావడం సిగ్గుచేటన్నారు.లెఫ్ట్ పార్టీలు వేస్ట్ అన్న కేసీఆర్.. ఇప్పుడు వాళ్ళతోనే జతకట్టారని విమర్శించారు. మునుగొడులో నైతిక విజయం బీజేపీదేనన్నారు.ప్రజాసంగ్రామయాత్రతో రాష్ట్రంలో బీజేపీ బలమైన పార్టీగా మారిందన్నారు.