టెట్​ రాస్తుండగా పురిటినొప్పులు

టెట్​ రాస్తుండగా పురిటినొప్పులు

రామచంద్రాపురం (అమీన్​పూర్​), వెలుగు: టెట్​రాస్తుండగా ఓ మహిళా అభ్యర్థికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో అధికారులు ఆమెను 108 లో హుటాహుటిన జిల్లా సర్కార్​ హాస్పిటల్​కు తరలించారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ టెట్​ సెంటర్​లో ఆదివారం జరిగింది.  సంగారెడ్డి జిల్లా నారాయణ్​ఖేడ్​ పరిధిలోని కల్హేర్​ మండలం కృష్ణాపూర్ కి  చెందిన కొడబోయిన అర్చన, టెట్​ఎగ్జామ్​ రాసేందుకు ఆదివారం అమీన్​పూర్​లోని లైఫ్​లైన్​ స్కూల్ సెంటర్​కు వచ్చారు. అప్పటికే అర్చన నెలలు నిండిన గర్భిణి కావడంతో పరీక్ష మొదలైన కొద్దిసేపటికే పురిటి నొప్పులు వచ్చాయి. తహసీల్దార్​విజయ్​కుమార్​ఆధ్వర్యంలో అధికారులు అర్చనను 108 లో సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్​కు తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు 2రోజుల పాటు అడ్మిట్ కావాలని సూచించారు.