రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు: టెట్రాస్తుండగా ఓ మహిళా అభ్యర్థికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో అధికారులు ఆమెను 108 లో హుటాహుటిన జిల్లా సర్కార్ హాస్పిటల్కు తరలించారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ టెట్ సెంటర్లో ఆదివారం జరిగింది. సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ పరిధిలోని కల్హేర్ మండలం కృష్ణాపూర్ కి చెందిన కొడబోయిన అర్చన, టెట్ఎగ్జామ్ రాసేందుకు ఆదివారం అమీన్పూర్లోని లైఫ్లైన్ స్కూల్ సెంటర్కు వచ్చారు. అప్పటికే అర్చన నెలలు నిండిన గర్భిణి కావడంతో పరీక్ష మొదలైన కొద్దిసేపటికే పురిటి నొప్పులు వచ్చాయి. తహసీల్దార్విజయ్కుమార్ఆధ్వర్యంలో అధికారులు అర్చనను 108 లో సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు 2రోజుల పాటు అడ్మిట్ కావాలని సూచించారు.