
న్యూఢిల్లీ: టోకు ధరల పెరుగుదలను కొలిచే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) ఈ ఏడాది మే నెలలో 14 నెలల కనిష్టమైన 0.39 శాతానికి తగ్గింది. ఆహార పదార్ధాల ధరలు, ఇంధన ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం దిగొచ్చింది. జియోపొలిటికల్ టెన్షన్స్ ఉండడం వలన రానున్న నెలల్లో ధరలు పెరగొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో డబ్ల్యూపీఐ 0.85 శాతం ఉండగా, గత ఏడాది మేలో 2.74 శాతంగా రికార్డయ్యింది.
మేలో హోల్సేల్ ద్రవ్యోల్బణం పాజిటివ్గా ఉండడానికి కారణం ఫుడ్ ప్రొడక్ట్స్ తయారీ, ఎలక్ట్రిసిటీ, ఇతర మాన్యుఫాక్చరింగ్, కెమికల్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్, ఆహారేతర ఐటెమ్స్ ధరలు పెరగడమేనని, లేకపోతే డబ్ల్యూపీఐ నెగెటివ్లో ఉండేదని ప్రభుత్వం పేర్కొంది. ఫుడ్ ఐటెమ్స్ మేలో 1.56 శాతం డీఫ్లేషన్ (మైనస్లో ఇన్ఫ్లేషన్) నమోదైంది. ఏప్రిల్లో ఇది మైనస్ 0.86 శాతంగా ఉంది. కూరగాయలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పప్పులు నెగెటివ్ ఇన్ఫ్లేషన్లో ఉన్నాయి.