ఫోన్ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ కేసులో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటీసులు ఎందుకిస్తలేరు? : బండి సంజయ్

ఫోన్ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ కేసులో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  నోటీసులు ఎందుకిస్తలేరు? : బండి సంజయ్
  • సిరిసిల్ల కేంద్రంగానే జరిగినా కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎందుకు విచారిస్తలేరు?: బండి సంజయ్ 
  • ఆనాడు సీబీఐ విచారణ కోరిన రేవంత్.. ఇప్పుడెందుకు సీబీఐకి అప్పగించట్లే
  • ఈ కేసును సీబీఐకి ఇస్తే కేసీఆర్, కేటీఆర్, ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావును గుంజుకపోయి జైల్లో వేసేవాళ్లం 
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందమేమిటని ఫైర్

కరీంనగర్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎందుకు విచారించడం లేదని రాష్ట్ర ప్రభు త్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ‘‘పెద్దాయన చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఏసీ బీకి రాధాకిషన్ రావు స్వయంగా వాంగ్మూలమిచ్చి నా కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎందుకు నోటీసులివ్వడం లేదు? సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తేలినా కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎందుకు విచారించడం లేదు? మాకు నోటీసులిస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్ విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందమేంటి?” అని ఫైర్ అయ్యారు. 

శనివారం (June 21) కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన అంత ర్జాతీయ యోగా దినోత్సవంలో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఎందుకు ఆ పని చేయడం లేదని ప్రశ్నించారు. 

‘‘కేంద్రం నేరుగా సీబీఐ విచారణ జరిపే అవకాశ మే లేదు. సీబీఐకి నేరుగా విచారణ జరిపే అవకాశముంటే.. ఈ కేసును ఎప్పుడో తేల్చేసేవాళ్లం. ప్రభాకర్ రావుతో పాటు కేసీఆర్, కేటీఆర్ సహా దోషులందరినీ గుంజుకుపోయి జైళ్లో వేసేవాళ్లం” అని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌పై మొట్టమొదట మాట్లాడిందే తాను అని తెలిపారు.  

ప్రభాకర్ రావుకు రాచమర్యాదలు మానండి.. 

ఫోన్ ట్యాపింగ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ‘‘ప్రభాకర్ రావు అనేక మంది జీవితాలను నాశనం చేసిండు.నాతో సహా బీజేపీ నేతలందరి ఫోన్లను ట్యాప్ చేసిన నీచుడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాతే ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయిండు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు బీజేపీతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు మాత్రమే కాదు.. చివరికి జడ్జీల ఫోన్లను ట్యాప్ చేశారు. 

అందుకే ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలి” అని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభాకర్ రావుకు రాచమర్యాదలు చేయడం మాని, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆనాడు ప్రభాకర్ రావు ఆదేశాలతోనే నైట్ డ్రెస్ మీద ఉన్న తనను గుంజుకుపోయి 6 జిల్లాలు తిప్పుతూ అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. 

ఆనాడు ఫోన్ మాట్లాడాలంటే భయపడ్డాం.. 

బీఆర్ఎస్ హయాంలో ఫోన్ మాట్లాడాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉండేవని సంజయ్ అన్నారు. ‘‘ప్రభాకర్ రావు నా దగ్గరున్న పోలీసు లతో మాట్లాడిన ఫోన్ సంభాషణను నేను విన్నా. ఆనాడు భార్యతో, కొడుకుతో మాట్లాడాలన్నా వాట్సాప్, ఫేస్ టైం, సిగ్నల్ కాల్స్ ద్వారా మాట్లాడుకునే దుస్థితిలో ఉన్నది నిజం కాదా? ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చే సమయంలోనే కేటీఆర్ అమెరికా వెళ్లింది నిజం కాదా?. ఆయన యూఎస్ వెళ్లిన తర్వాతే ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చి విచారణకు హాజరవుతున్న మాట వాస్తవం కాదా?” అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ మధ్య ఒప్పందం ఉందన్నది తప్పుడు ప్రచారమని మండిపడ్డారు.