
హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ప్రత్యేక సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ప్రధాని మోదీకి రాసిన లేఖలో మహిళా బిల్లును ఎందుకు ప్రస్తావించలేదని కాంగ్రెస్ మాజీ చీఫ్సోనియాగాంధీని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్(ఎక్స్) వేదికగా ప్రశ్నించారు. చట్ట సభల్లో మహిళలకు ప్రాతినిథ్యం కల్పించే బిల్లు జాతీయ స్థాయిలో ప్రముఖ్యతున్న అంశం కాదా అని నిలదీశారు. ఈ లేఖతో మహిళా బిల్లును కాంగ్రెస్పార్టీ పూర్తిగా విస్మరిస్తున్నట్లు తేలిపోయిందని కవిత పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవితకు షర్మిల లేఖ
హైదరాబాద్, వెలుగు: మహిళా రిజర్వేషన్లను అమలు ముందుగా మీ పార్టీ నుంచే స్టార్ట్ చేయాలని ఎమ్మెల్సీ కవితను వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల కోరారు. రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేయకుండా ఈ పోరాటాన్ని జాతీయ వేదికపై ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లపై బుధవారం షర్మిల కవితకు లేఖ రాశారు. “మీ పార్టీ ఏర్పాటైన 2001 నుంచి మహిళలకు 5% కూడా టికెట్లు ఇవ్వలేదు. 2014లో మహిళలకు 6, 2018లో 4 టికెట్లు ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో 2014లో ఒకరికి, 2019లో ఇద్దరికి ఇచ్చారు. దీనిపై ఏనాడు మీ తండ్రి కేసీఆర్ను ప్రశ్నించలేదు. మీ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఢిల్లీలో ఉద్యమం చేయటం హాస్యాస్పదం ”అని లేఖలో షర్మిల పేర్కొన్నారు.