భగవంతుడికి రకరకాల పూలు, ప్రసాదాలు సమర్పించి పూజలు చేస్తారు. కానీ వాటి వెనక అంతర్యం గురించి అంతగా ఆలోచించరు. దేవుడికి సంబంధించిన ప్రతి కార్యక్రమం వెనక భక్తికి చెందిన అంశమే కాదు... మనిషికి, సమాజానికి ఉపయోగపడే అనేక విషయాలు ఉన్నాయి.
పూలతో దేవుడ్ని పూజించడం అంటే కేవలం చెట్లకు, మొక్కలకు పూసే పూలని కాదు. మనిషిలో ఉన్న దుర్గుణాలను వదిలేసి, మంచి ప్రవర్తనతో నడిచే విధానాన్ని నేర్పే పూలు అని కూడా అర్థం. నైవేద్యం పెట్టడం అంటే దేవుడికి భోజనం పెట్టడం కాదు. ఆహారం తయారు చేయడంలో శుచి, శుభ్రత పాటించాలని, శ్రమ విలువ తెలుసుకోవాలని..
అర్పించే పువ్వులు
భగవంతుడిని పూలతో అలంకరిస్తారు. కానీ చెట్లకు పూసే పూలకన్నా మనిషి ప్రవర్తనలో దాగి ఉన్న మంచి పూలతో పూజించాలని పురాణాల ద్వారా తెలుస్తుంది.
- మొదటి పుష్పం.. అహింస బందువులు: స్నేహితులకే కాదు, ఎవరికే బాధకలిగించ కుండా జీవించాలి.
- రెండోపుష్పం ఇంద్రియ నిగ్రహం... జ్ఞానేం ద్రియాలను, కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి.
- మూడో పుష్పం దయ ... సాటి వారికి సాయం చేస్తూ, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలి.
- నాలుగో పుష్పం... క్షమ.. ఎవరైనా బాధ పెట్టినా, అపకారం చేసినా క్షమించాలి తప్ప.. తిరిగి అపకారం చేయకూడదు.
- అయిదో పుష్పం ...ధ్యానం... ఇష్టమైన దేవుడిని ఎలా ధ్యానం చేస్తారో... అలాగే నమ్మిన వాళ్లను మోసం చేయకుండా, ఎప్పుడూచేసే పనుల మీద ధ్యాస పెట్టాలి.
- ఆరో పుష్పం ... తపస్సు .. మాట.. మనసు.. శరీరం మూడింటిని భగవంతుడి మీదే నింపాలి. అంటే విజయం సాధించాలంటే తప్పనిసరిగా ఇలాంటి తపస్సులాగే బాధ్యతలు నిర్వహించాలి.
- ఏడోపుష్పం ... జ్ఞానం.. ఏ కార్యానైనా మొదలు పెట్టి ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవటమే జ్ఞానం. అప్పుడే ముందుకు వెళ్లగలరు ఆ కార్యాన్ని పూర్తి చేయగలరు.
- ఎనిమిదోపుష్పం...సత్యం... అబద్దాలు ఆడకుండా, లోక రీతిని బట్టి నడుచుకోవడ మే సత్యం
ఈ ఎనిమిది రకాలతో రోజూ దేవుడిని అలంకరించాలి. అంటే ప్రతి వ్యక్తి వీటిని దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలన్నమాట. అప్పుడే సంతోషంగా ఉంటారు.
నైవేద్యం సామూహిక ధర్మం
- అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు. అలాంటి భగవంతుడి రూపాన్ని పారేయకూడదన్న విషయం భోజనం తినే ప్రతిసారీ గుర్తుకు వస్తుంది. దాంతో ఆహారాన్ని వృథా -చేయరు.
- చాలామంది భోజనం తింటూ అదీ బాగలేదు. ఇది బాగలేదు. అలా వండితే బాగుండేది.. లాంటి వంకలు పెడుతుంటారు. రుచికి ఎక్కువ ప్రాధా న్యత ఇస్తారు. దేవుడికి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని అలా అనకూడదన్న భావన కూడా దీనిలో అంతర్గతంగా ఉంది
- భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత దానిలో కొద్దిగా అయినా అతిథులకు పెట్టడం సంప్రదాయం. అంటే తనతోపాటు ఇతరుల ఆకలినీ గుర్తించాలన్న సామాజిక స్పృహా నైవేద్యంలో కనిపిస్తుంది.
- ఆహారం తినే ముందు నేను సంపా దించాను' అనే గర్వం కలుగుతుంది.. దాని నుంచి బయట పడటానికే తనే ముందు దేవుడికి నైవేద్యం పెట్టడం ఆచారంగా వచ్చిందని చెప్పాన్పు.
- దేవుడికి నైవేద్యంగా పెట్టేదాన్ని రైతులు కష్టపడి పండిస్తారు. ప్రకృతి అనుకూలిస్తుంది. తోటి మనుషులు సాయం చేస్తారు. అనే ఆలోచన గుర్తుకు రావాలి. ఇందువల్ల నైవేద్యంలో సామూహికమైన కష్టం దాగి ఉంది.
వెలుగు,లైఫ్
