పారతో కొట్టి భార్య హత్య ..వికారాబాద్ జిల్లా పెద్దేముల్ తండాలో ఘటన

పారతో కొట్టి భార్య హత్య ..వికారాబాద్ జిల్లా పెద్దేముల్ తండాలో  ఘటన
  • మెంటల్ ట్రీట్మెంట్ తీసుకొని ఇటీవలే ఇంటికొచ్చిన భర్త

వికారాబాద్, వెలుగు: భార్యాభర్తల మధ్య వివాదం జరగడంతో భార్యను భర్త పారతో తలపై కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన వికారాబాద్​ జిల్లా పెద్దేముల్​ తండాలో జరిగింది. పెద్దేముల్​ ఎస్సై శంకర్​ తెలిపిన ప్రకారం.. పెద్దేముల్​ తండాకు చెందిన మూడవత్​ రవికి 15 ఏండ్ల కింద అనిత(28)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రవి మతిస్థిమితం కోల్పోయి కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఆయనను తిరిగి ఇటీవలే ఇంటికి తీసుకువచ్చి ట్రీట్​మెంట్​ చేయించారు. ఆదివారం రవి, అనిత మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రవి పార తీసుకొని భార్య అనిత తలపై గట్టిగా కొట్టాడు. తీవ్రగాయాలతో ఆమె స్పాట్​లో చనిపోయింది. మృతిరాలి సోదరుడు కేతావత్​ క్రిష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్​ తెలిపారు. సంఘటనా స్థలాన్ని తాండూర్​ డీఎస్పీ  నర్సింగ్​ యాదయ్య, తాండూర్​ రూరల్​ సీఐ ప్రవీణ్​కుమార్​రెడ్డి, ఎస్సై శంకర్​ పరిశీలించారు.