ప్రియుడి కోసం భర్తను చంపింది!

ప్రియుడి కోసం భర్తను చంపింది!

నిజామాబాద్ క్రైం, వెలుగు: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్పలో గుర్తుతెలియని వ్యక్తి మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మూడ్రోజుల కిందట లభించిన డెడ్ బాడీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తి  జిల్లా కేంద్రంలోని సూర్యనగర్ కు చెందిన జె. నారాయణ గా గుర్తించారు. నారాయణను ఆయన సొంతింట్లోనే చంపేసి, డెడ్ బాడీని సంచిలో పెట్టి.. ఇద్దరు వ్యక్తులు బైక్ మీద తీసుకెళ్లి మంచిప్ప ఊరి బయట పడేసినట్లు సీసీ కెమెరా ఫుటేజీల్లో తేలింది. మర్డర్ అయిన మరుసటి రోజు నుంచే మృతుడి భార్య కనిపించకపోవడంతో ఇందులో ఆమె ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానిస్తూ పోలీసులు దర్యాప్తు చేశారు. నారాయణ మర్డర్ కేసులో అతని భార్యతో పాటు  మరో ముగ్గురు ప్రమేయం ఉన్నట్లుగా తేల్చారు.