నేను భగత్ సింగ్ అనుచరుడిని ..భయపడ : మనీశ్​ సిసోడియా

నేను భగత్ సింగ్ అనుచరుడిని ..భయపడ : మనీశ్​ సిసోడియా
  • నేను భగత్  సింగ్ అనుచరుడిని
  •  నాకు దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నాయ్
  • ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా

“ఈ రోజు సీబీఐ ఆఫీసుకు వెళ్తున్నా.. విచారణకు వాళ్లకు పూర్తిగా సహకరిస్తా.. లక్షలాది మంది పిల్లల ప్రేమ, కోట్లాది మంది దేశ ప్రజల ఆశీస్సులు మా వెంట ఉన్నాయి. కొన్ని  నెలలు జైల్లో ఉండాల్సి వచ్చినా పట్టించుకోను. దేశం కోసం ఉరితీయబడిన భగత్  సింగ్ అనుచరుడినిని నేను’ అంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సీసోడియా చేసిన ట్వీట్ చర్చనీయాంశగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో  ఇప్పటికే సీబీఐ పలువురుని ఆరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  తాజాగా దర్యాప్తును మరింతగా ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నేడు  ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియాను సీబీఐ విచారిస్తోంది.

 కేంద్ర దర్యాప్తు సంస్థలు తనను అరెస్టు చేసే అవకాశం ఉందని సిసోడియా ట్విట్టర్ లో తన  అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలో  ఆయన ఇంటి ముందు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. గత ఆదివారం సిసోడియాకు సీబీఐ నుంచి సమన్లు అందాయి. విచారణలో సిసోడియాను సీబీఐ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగనున్నారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. విచారణ అనంతరం సీబీఐ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేది హాట్ టాపిక్ గా మారింది.