- ఎగ్జిట్ పోల్స్తో సంబంధం లేకుండా గెలుస్తం
- నకిలీ వీడియోలను సర్క్యులేట్ చేసేవాళ్లపై ఈసీ చర్యలు తీసుకోవాలి
- ఎగ్జిట్ పోల్స్ తప్పయితే ఆయా సంస్థలు క్షమాపణ చెప్పాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఎగ్జిట్పోల్స్తో కార్యకర్తలు అయోమయానికి గురికావొద్దని, 70 సీట్లలో బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని ఆ పార్టీవర్కింగ్ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్అన్నారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ముగిసిన అనంతరం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 21న బీఆర్ఎస్అభ్యర్థులను ప్రకటించిన రోజు నుంచి పార్టీ గెలుపు కోసం పని చేసిన కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు చెప్తున్నట్లు పేర్కొన్నారు.
ఎగ్జిట్పోల్స్తో సంబంధం లేకుండా గెలుస్తామన్న ధీమా ఉందని అన్నారు. 2018లో ఒక్క ఏజెన్సీ మినహా మిగతావన్నీ తప్పుడు ఫలితాలు ఇచ్చాయని విమర్శించారు. ఎగ్జిట్పోల్స్తప్పు అని నిరూపించడం తమ పార్టీకి కొత్త కాదని కేటీఆర్ అన్నారు. అసలైన ఫలితం డిసెంబర్ 3న వస్తుందని, మరోసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓటర్లు క్యూలైన్లలో ఉన్నప్పుడు ఎగ్జిట్పోల్స్ ప్రకటిస్తే వాళ్లు ప్రభావితం అవుతారని, దీనిపై ఎలక్షన్కమిషన్ఆలోచించాలని అన్నారు. ఇదే అంశంపై సీఈవోతో మాట్లాడితే ఎన్నికల కమిషన్నిబంధనలు అలా ఉన్నాయని చెప్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఎగ్జిట్పోల్స్తప్పని తేలితే ఆయా సంస్థలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అబద్ధాలు, నకిలీ వీడియోలతో ప్రజలను ప్రభావితం చేసే పార్టీలపై ఎలక్షన్కమిషన్చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంత పోలింగ్నమోదైందనే వివరాలు శుక్రవారం ఉదయమే వస్తాయని, అప్పుడు సరైన విశ్లేషణలు చేయడానికి అవకాశం ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఒక్క హైదరాబాద్లోనే కాదు అన్ని మెట్రో సిటీల్లో ఓటింగ్శాతం తక్కువగానే నమోదవుతుందని, సిటీ జనాలు బయటకు వచ్చి ఓట్లు వేయాలని తాము అప్పీల్చేశామని అన్నారు.