
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికల నిర్వహణలో ఈసీ పనితీరు పట్ల అన్ని చోట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈవిఎంలు మొరాయించడం, పలు ప్రాంతాల్లో కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో పోలింగ్ సమస్యాత్మక వాతావరణంలోనే కొనసాగింది. కొన్ని చోట్ల కనీస ఓటింగ్ శాతం కూడా సరిగా నమోదు కాకపోవడంతో రీపోలింగ్ నిర్వహించాలని ఆ ప్రాంత ప్రతినిధులు, అధికారులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్.. ఆ జిల్లాలోని గుంటూరు వెస్ట్ 244 వ బూత్, నరసరావు పేట 94 వ బూత్ లలో రి పోలింగ్ నిర్వహించాలని సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదికి సిఫార్సు చేశారు. దీనిపై స్పందించిన ద్వివేది కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఈ ప్రతిపాదనలను పంపామని, ఈసీ ఆదేశాల మేరకే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.