ఉప్పల్, వెలుగు: కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపి వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఉప్పల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. శనివారం ప్రభాకర్ రామంతపూర్ డివిజన్ లోని శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఉప్పల్ కారిడార్ సాధించానన్నారు. గతంలో ఉప్పల్ నియోజకవర్గంలో తాగు నీటి కొరత ఉండేదని అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో మాట్లాడి రూ. 450 కోట్లు తెచ్చి, 12 రిజర్వాయర్లు కట్టించానన్నారు.
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించానన్నారు. శ్రీనివాసపురం ఈస్ట్ శ్రీనివాసపురం వివేక్ నగర్ మధురానగర్లో పాదయాత్ర చేశారు. రాఘవేంద్ర నగర్, న్యూ రాఘవేంద్రనగర్, అన్నపూర్ణ కాలనీ, శ్రీ సాయినగర్ కాలనీ, ఇందిరానగర్, శాంతి గార్డెన్స్, వీర సావర్కర్ నగర్, బాబానగర్ పలు కాలనీల్లో ప్రచారం చేశారు. మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ , పద్మారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.