
హెలికాప్టర్ల విన్యాసాలతో ఆకాశం కలర్ఫుల్గా మారింది. బేగంపేటలో వింగ్స్ ఇండియా ఎయిర్ షో రెండో రోజు శుక్రవారం వివిధ దేశాల విమానాల ప్రదర్శన, విన్యాసాలు, పలు రకాల డ్రోన్లు, బిజినెస్ విజిటర్స్తో సందడి నెలకొంది. చాపర్లు, హెలికాప్టర్ల విన్యాసాలు, కళ్లు చెదిరే డ్రోన్ షోలు సందర్శకులను కట్టిపడేశాయి. సాయంత్రం ఏవియేషన్ షోలో భాగంగా 500 డ్రోన్లతో చేసిన షో ఆకట్టుకుంది.
దేశ విమానయాన రంగంలో వచ్చిన మార్పులను డ్రోన్ షో ద్వారా చూపించారు. నాలుగురోజులు జరిగే ఏవియేషన్షోలో మొదటి రెండు రోజులు బిజినెస్ విజిటర్స్కు మాత్రమే ఎంట్రీ ఉండగా, శనివారం నుంచి ప్రజలను కూడా అనుమతిస్తారు. ఇందుకు బుక్ మై షో ద్వారా టికెట్లను బుక్ చేసువాలి. ఒక్కో టికెట్ రూ. 750 లుగా నిర్వాహకులు నిర్ణయించారు. మూడేండ్ల పై బడిన ప్రతి ఒక్కరు ఎంట్రీ టికెట్ తీసుకోవాలి.