బేగంపేట​లో ఎయిర్​ ఎగ్జిబిషన్​ అదుర్స్

బేగంపేట​లో ఎయిర్​ ఎగ్జిబిషన్​ అదుర్స్

హెలికాప్టర్ల విన్యాసాలతో ఆకాశం కలర్​ఫుల్​గా మారింది. బేగంపేటలో వింగ్స్ ​ఇండియా ఎయిర్ షో రెండో రోజు శుక్రవారం వివిధ దేశాల విమానాల ప్రదర్శన, విన్యాసాలు, పలు రకాల డ్రోన్లు, బిజినెస్​ విజిటర్స్​తో సందడి నెలకొంది. చాపర్లు, హెలికాప్టర్ల విన్యాసాలు, కళ్లు చెదిరే  డ్రోన్​ షోలు  సందర్శకులను కట్టిపడేశాయి.  సాయంత్రం ఏవియేషన్​ షోలో భాగంగా 500 డ్రోన్లతో చేసిన షో ఆకట్టుకుంది.

దేశ విమానయాన రంగంలో వచ్చిన మార్పులను డ్రోన్ షో ద్వారా చూపించారు.  నాలుగురోజులు జరిగే ఏవియేషన్​షోలో మొదటి రెండు రోజులు బిజినెస్​ విజిటర్స్​కు మాత్రమే ఎంట్రీ ఉండగా, శనివారం నుంచి ప్రజలను కూడా అనుమతిస్తారు. ఇందుకు బుక్​ మై షో ద్వారా టికెట్లను బుక్​ చేసువాలి. ఒక్కో టికెట్​ రూ. 750 లుగా నిర్వాహకులు నిర్ణయించారు. మూడేండ్ల పై బడిన ప్రతి ఒక్కరు ఎంట్రీ టికెట్​ తీసుకోవాలి.