
‘జెర్సీ’ చిత్రంతో నటిగా చక్కని గుర్తింపును అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్.. త్వరలో ‘విట్నెస్’ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. రోహిణి కీలకపాత్ర పోషించింది. దీపక్ దర్శకత్వం వహించడంతో పాటు కెమెరామేన్గానూ వ్యవహరించాడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఇందులో పారిశుద్ధ్య కార్మికుల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. పార్థిబన్ అనే 20 ఏళ్ల కుర్రాడు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ సెప్టిక్ ట్యాంక్ను క్లీన్ చేస్తూ మరణిస్తాడు. ఆ కుర్రాడి మరణానంతరం, అతని తల్లితో కలిసి న్యాయం పోరాటం చేస్తుంది శ్రద్ధా. ఆ పోరాటంలో ఆమె గెలిచిందో లేదో తెలియాలంటే ‘విట్నెస్’ చూడాల్సిందేనంటూ క్యూరియాసిటీ పెంచేలా ట్రైలర్ కట్ చేశారు. శ్రద్ధా శ్రీనాథ్ ఆర్కిటెక్ట్గా కనిపిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 9 నుంచి సోని లివ్లో స్ట్రీమ్ కానుంది.