అంపైర్‌‌‌‌ను విమర్శించినందుకు పూరన్‌‌‌‌కు జరిమానా

 అంపైర్‌‌‌‌ను విమర్శించినందుకు పూరన్‌‌‌‌కు జరిమానా

ప్రోవిడెన్స్‌‌‌‌ (గయానా):  వెస్టిండీస్‌‌‌‌ వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ కమ్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ నికోలస్‌‌‌‌ పూరన్‌‌‌‌కు జరిమానా పడింది. ఇండియాతో జరిగిన రెండో టీ20లో బహిరంగంగా అంపైర్‌‌‌‌ను విమర్శించినందుకు అతని మ్యాచ్‌‌‌‌ ఫీజులో 15 శాతం కోత విధించారు. 

అలాగే క్రమశిక్షణ రికార్డులో ఒక డీమెరిట్‌‌‌‌ పాయింట్‌‌‌‌ను యాడ్‌‌‌‌ చేశారు. ఐసీసీ కోడ్ ఆఫ్‌‌‌‌ కండక్ట్‌‌‌‌లోని ఆర్టికల్‌‌‌‌ 2.7 ప్రకారం పూరన్‌‌‌‌ లెవెల్‌‌‌‌–1 తప్పిదానికి పాల్పడినట్లు మ్యాచ్‌‌‌‌ రిఫరీ తేల్చారు. 

పూరన్‌‌‌‌ కూడా తప్పును అంగీకరించడంతో అధికారిక విచారణ లేకుండానే ఫైన్‌‌‌‌ వేశారు. ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌ సందర్భంగా నాలుగో ఓవర్‌‌‌‌లో అంపైర్‌‌‌‌ ఇచ్చిన ఎల్బీ రివ్యూపై పూరన్‌‌‌‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.