పత్తి ఏరేందుకు వెళ్తూ వాహనం నుంచి జారిపడి యువతి మృతి

పత్తి ఏరేందుకు వెళ్తూ వాహనం నుంచి జారిపడి యువతి మృతి


కాగజ్​నగర్, వెలుగు: ఆసిఫాబాద్ ​జిల్లా చింతలమానేపల్లి మండలంలో బుధవారం పత్తి ఏరేందుకు వెళ్తూ వాహనంలో నుంచి జారి పడి ఓ యువతి చనిపోయింది. స్థానికుల కథనం ప్రకారం.. పాల్వాయినగర్ కు చెందిన దుర్గం అంకులు, మీనా దంపతుల బిడ్డ అఖిల(19) బుధవారం పత్తి ఏరడానికి తల్లి, మరికొందరు కూలీలతో కలిసి ఫోర్​వీలర్​(బొలెరో)లో వెళ్లింది. అందరూ వెనక కూర్చోగా అఖిల ప్రమాదవశాత్తూ అందులోంచి జారి రోడ్డుపై పడిపోయింది. తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె ను అదే వెహికల్​లో కౌటాలలోని హాస్పిటల్ కు తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్ ప్రకటించారు. మృతురాలి తండ్రి అంకులు జార్ఖండ్​లో ఉండడంతో ఆయన రాక కోసం వేచి చూస్తున్నారు. బుధవారం రాత్రి వరకైతే తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చింతలమానేపల్లి ఎస్ఐ సురేశ్ తెలిపారు.