ముంబై మెట్రో స్టేషన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గౌరీ కుమారీ సాహు అనే యువతి డ్రెస్సు ప్రమాదవశాత్తు మెట్రో రైలు డోరులో ఇరుక్కుపోయింది. అది గమనించని లోకోపైలట్ రైలును ముందుకు కదిలించాడు. బాధితురాలు అరిచినా పట్టించుకోలేదు. లోకోపైలట్ నిర్లక్ష్యం కారణంగా బాధితురాలు ప్రాణపాయ స్థితికి వెళ్లింది. రైలుతో పాటుగా బాధితురాలు ప్లాట్ ఫామ్ పై కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ముంబైలోని చాకలా మెట్రో స్టేషన్లో ప్లాట్ఫ్లామ్పై రైలు ఆగింది. ఈ క్రమంలో రైలు నుంచి దిగుతుండగా.. యువతి డ్రెస్ రైలు డోర్లో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో గౌరీ కుమారీ.. పక్క కోచ్లో ఉన్న లోకోపైలట్కు వినిపించేలా అరించింది. ఇంతలోనే ప్లాట్ఫ్లామ్పై ఉన్న మరో ప్రయాణికుడు లోక్పైలట్ను అలర్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇదేమీ పట్టించుకోకుండా రైలును ముందుకు కదిలించడంతో ఆమె.. రైలుతో పాటే కొంత దూరం పరిగెత్తి తర్వాత కిందపడిపోయింది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ చివరి వరకు కింద ఈడ్చుకెళ్లింది.
బాధితురాలిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. చివరికి ఈ విషయాన్ని లోకోపైలట్ దృష్టికి తీసుకువెళ్లడంతో రైలును ఆపివేశాడు. ఈ ప్రమాదంలో బాధితురాలికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. లోక్పైలట్ నిర్లక్ష్యం కారణంగానే తాను గాయపడినట్టు.. అతడిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.