30 ఏళ్ల మహిళపై మైనర్ల గ్యాంగ్‌రేప్

30 ఏళ్ల మహిళపై మైనర్ల గ్యాంగ్‌రేప్

వీడియో తీసి అమ్ముతుండగా పట్టుకున్న పోలీసులు

ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. మహిళపై మైనర్లు అత్యాచారం చేసిన ఘటన బడాన్‌ జిల్లాలో జరిగింది. ఈ ఘటన గత అక్టోబర్‌లో జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను, ఫోటోలను అమ్ముతుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బడాన్ పట్టణానికి చెందిన ఓ 30 ఏళ్ల మహిళను 15 నుంచి 17 సంవత్సరాల వయసు గల మైనర్లు గత అక్టోబర్‌లో సామూహిక అత్యాచారం చేశారు. ఆ సంఘటనను మొత్తం వీడియో, ఫోటోలు తీశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. దాంతో బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

అయితే నిందితులు తాజాగా ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలను అమ్మడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు ఫోటోలను రూ. 300లు తీసుకొని ఒక్కొక్కరికి ఫార్వార్డ్ చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వెంటనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

For More News..

రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోంది

అన్నం ఆలస్యంగా పెట్టిందని తల్లిని చంపిన కొడుకు

లోయలో పడ్డ టీచర్ల బస్సు.. 10 మంది మృతి

సీట్లు ఫుల్ చేసుకోవడానికి థియేటర్లకు గ్రీన్ సిగ్నల్