వీడియో తీసి అమ్ముతుండగా పట్టుకున్న పోలీసులు
ఉత్తరప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. మహిళపై మైనర్లు అత్యాచారం చేసిన ఘటన బడాన్ జిల్లాలో జరిగింది. ఈ ఘటన గత అక్టోబర్లో జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను, ఫోటోలను అమ్ముతుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బడాన్ పట్టణానికి చెందిన ఓ 30 ఏళ్ల మహిళను 15 నుంచి 17 సంవత్సరాల వయసు గల మైనర్లు గత అక్టోబర్లో సామూహిక అత్యాచారం చేశారు. ఆ సంఘటనను మొత్తం వీడియో, ఫోటోలు తీశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. దాంతో బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.
అయితే నిందితులు తాజాగా ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలను అమ్మడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు ఫోటోలను రూ. 300లు తీసుకొని ఒక్కొక్కరికి ఫార్వార్డ్ చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వెంటనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
For More News..