
కామారెడ్డి , వెలుగు : డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదనే బాధతో ఓ మహిళ సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి యాసిడ్ బాటిల్తో వచ్చింది. ఇది గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకుని బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురాకు చెందిన షబానా డబుల్ బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంది.
కొద్ది రోజుల క్రితం లక్కీ డ్రా తీయగా పేరు రాలేదు. దీంతో తనకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించాలని సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి దరఖాస్తు పెట్టుకోవడానికి వచ్చింది. అయితే, వచ్చేప్పుడు కవర్లో బాత్రూంలో వాడే యాసిడ్బాటిల్తీసుకువచ్చింది. లోపలకు వెళ్లడానికి లైన్లో నిలబడింది. అప్పుడే ఓ కానిస్టేబుల్గమనించి ఆమె కవర్ ఓపెన్చేసి చూడగా బాత్రూంలో వాడే యాసిడ్ బాటిల్కనిపించింది. దీంతో ఆ బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా షబానా మాట్లాడుతూ తనకు ఇల్లు లేదని, డబుల్ బెడ్రూం ఇంటి కోసం అప్లై చేసినా రాలేదన్నారు. ఇల్లు రాకపోతే ఆత్మహత్య చేసుకుందామని యాసిడ్ బాటిల్ తెచ్చుకున్నానని చెప్పింది. పోలీసులు ఆమెకు సర్ధి చెప్పి ఇంకోసారి ఇలాంటి పని చేయవద్దని, అప్లికేషన్పెట్టుకోవాలని లోపలకు పంపించారు. దీంతో ఆఫీసర్లకు తనకు డబుల్ ఇల్లు ఇప్పించాలని దరఖాస్తు పెట్టుకుని వెళ్లిపోయింది.