డీడీ హాస్పిటల్లో మహిళపై అత్యాచారయత్నం

డీడీ హాస్పిటల్లో మహిళపై అత్యాచారయత్నం
  • నిందితుడు హౌస్​కీపింగ్​ సిబ్బంది 
  • మతిస్థిమితం లేదన్న పోలీసులు

ముషీరాబాద్, వెలుగు: విద్యానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని దుర్గాబాయి దేశ్ ముఖ్(ఆంధ్ర మహిళా సభ) హాస్పిటల్​లో ఓ పేషెంట్​భార్యపై అదే దవాఖానలో పని చేస్తున్న ఓ హౌస్​కీపింగ్​సిబ్బంది అత్యాచారయత్నం చేశాడు. సీఐ జగదీశ్వర్​రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ కు చెందిన వ్యక్తి హైబీపీతో బాధ పడుతూ ఈ నెల 11న దుర్గాబాయి దేశ్ ముఖ్​దవాఖానలో చేరాడు. డాక్టర్లు అతన్ని రెండు రోజులపాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించి, శనివారం జనరల్ వార్డుకు మార్చారు.

 బాధితుడి భార్యపై హౌస్ కీపింగ్ సిబ్బంది సీతారాం సోమవారం తెల్లవారుజామున అత్యాచారయత్నం చేశాడు. ఆమె అరవడంతో అప్రమత్తమైన హాస్పిటల్​సిబ్బంది, పేషెంట్ల సహాయకులు సీతారాంను పట్టుకొని నల్లకుంట పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. నిందితుడి మానసిక స్థితి బాగాలేదని, అతను ఎర్రగడ్డ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​తీసుకుంటున్నాడని పేర్కొన్నారు.