కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకిన యువతి.. ఇంకా దొరకని ఆచూకీ

 కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకిన యువతి.. ఇంకా దొరకని ఆచూకీ

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న స్వప్న అనే మహిళ ఆచూకీ ఇంకా దొరకలేదు. అందుకోసం దుర్గం చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యువతి మృత దేహం కోసం ఘటన జరిగినప్పటినుంచీ గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో నేడు మరోసారి గాలింపు చర్యలు చేపట్టారు. మరోసారి స్పీడ్ బోట్స్, డీఆర్ఎఫ్ సిబ్బందితో పోలీసులు గాలిస్తున్నారు. దుర్గం చెరువులో బురద ఎక్కువగా ఉండడంతో మృతదేహం చిక్కుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే యువతి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, డిప్రెషన్ కు లోను కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. భర్తతో విడాకులు తీసుకొని 6 నెలలుగా దూరంగా ఉంటున్న స్వప్న... మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు గతంలో హాస్పిటల్ లో చికిత్స చేయించినట్టు సమాచారం. 

ఏడాది కాలంగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. కేబుల్ బ్రిడ్జి వద్ద ఆత్మహత్యలను అడ్డుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు వాచ్ టవర్ ఏర్పాటు చేశారు. కానీ పోలీసు సిబ్బంది పెట్రోలింగ్ చేసినట్టు కనిపించడం లేదనే విమర్శలూ వస్తున్నాయి.