జమ్మికుంటలో ఎంపీడీవో ఆఫీస్ ఎదుట మహిళల నిరసన

జమ్మికుంటలో ఎంపీడీవో ఆఫీస్ ఎదుట మహిళల నిరసన

జమ్మికుంట, వెలుగు: అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారంటూ జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మహిళలు గురువారం ఎంపీడీవో ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇప్పటికే ఇండ్లున్న వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

అనంతరం ఎంపీడీవో భీమేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు.