కరోనా మందులని.. మత్తు ట్యాబ్లెట్స్ ఇచ్చి చోరి

కరోనా మందులని..  మత్తు ట్యాబ్లెట్స్  ఇచ్చి చోరి

కరోనాను సొమ్ము చేసుకోవడానికి మార్కెట్లో ఇప్పటికే కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తూ బంగారు అభరణాలు ఎత్తుకెళ్తున్నారు.  కరోనా మందులని మత్తు ట్యాబ్లెట్  ఇచ్చి చోరీ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కుడ కుడ గ్రామంలో ఓ వృధ్ద మహిళకు కరోనా టాబ్లెట్స్ అని మత్తు టాబ్లెట్స్ ఇచ్చి మత్తులోకి జారిన వెంటనే ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. మూడు తులాలన్నర  పుస్తెలతాడును  అపహరించారు.