
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్చేస్తూ బాధిత కార్మిక కుటుంబాలు కొత్తగూడెంలోని హెడ్డాఫీస్ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టాయి. అంతకు ముందు కొత్తగూడెంలోని బంగ్లోస్ ఏరియాలో స్ట్రక్చర్మీటింగ్జరుగుతున్న ప్రాంతంలోనూ నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మారు పేర్ల సమస్యను పరిష్కరిస్తామని గతంలో కేసీఆర్ఇచ్చిన హామీని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మారు పేర్ల సమస్యపైన సింగరేణి యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా ఉంటుందని ఆరోపించారు.
ఆర్ఎల్సీ వద్ద చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్చేశారు. 30 ఏండ్లకుపైగా కంపెనీలో పనిచేసి కారుణ్య నియామకాల్లో తమ వారసులకు జాబ్ ఇవ్వాలంటే టెన్త్క్లాస్లో ఇంటి పేరు వేరే ఉందని యాజమాన్యం కొర్రీలతో ఇబ్బందులకు పెడుతుందని వాపోయారు. ఇప్పటికే పలువురు కార్మికులు మానసిక వేదనతో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మిక కుటుంబాలకు ఇఫ్టూ నేతలు గౌని నాగేశ్వరరావు, సంజీవ్మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. బాధితుల సమస్యను డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని గుర్తింపు సంఘం నేతలు కె. రాజ్కుమార్, వాసిరెడ్డి సీతారామయ్య హామీ ఇచ్చారు. ధర్నాలో శ్రావణ్, తిరుమల శ్రీనివాస్, ఈర్ల రాజయ్య, బాబు, హరీశ్, పి. వెంకటేశ్, కొమురమ్మ, ప్రదీప్, సుధాకర్, కళావతి, కిరణ్పాల్గొన్నారు.