తెలంగాణలో మారిన బ్యాంకుల పనివేళలు

తెలంగాణలో మారిన బ్యాంకుల పనివేళలు

తెలంగాణ ప్రభుత్వం నిన్న మరోసారి లాక్ డౌన్ ను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. 10 రోజుల పాటు పొడగించిన లాక్ డౌన్ టైంలో ప్రజా కార్యకలాపాల సమయాన్ని కూడా పొడిగించింది. ప్రజల కార్యకలాపాల సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పెంచారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి. బ్యాంకులు ఇకపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ తెలిపింది.

ఇంతకుముందు.. లాక్ డౌన్ సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ఉండగా.. బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే పనిచేశాయి. తాజా సడలింపులతో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి.