ఈ బాటిల్ ఖరీదు రూ. 45 లక్షలు!

ఈ బాటిల్ ఖరీదు రూ. 45 లక్షలు!

ఒక బాటిల్ ఖరీదు​ 45 లక్షల రూపాయాలా! అందులో ఏమన్నా అమృతం తాగుతారా? అని ఆశ్చర్యపోతున్నారా! కానీ, ఇందులో తాగేది మంచి నీళ్లే. మరెందుకు అంత రేటు?

చాలామంది కూల్ డ్రింక్స్​, విస్కీ, షాంపేన్​ వంటి వాటికోసం ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. కానీ, ఈ బాటిల్​లో నీళ్లు తాగాలంటే మాత్రం అక్షరాల 45 లక్షల రూపాయలు పెట్టి కొనాల్సిందే. అయితే ఈ బాటిల్​లో లీటర్​కు కొంచెం తక్కువ నీళ్లు పడతాయి.  ఇందులో తాగే నీళ్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. ఆ నీళ్లను ‘‘ఆక్వాది క్రిస్టల్లో ట్రిబుటొ అ మొడిగ్లియని” అంటారు. ఈ వాటర్​ని ఫ్రాన్స్​, ఫిజిల నుంచి తెప్పించారట. అది సరే కానీ... ఈ బాటిల్​కు ఇంతరేటు ఎందుకంటే అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి దీన్ని 24 క్యారెట్​ల బంగారంతో తయారుచేశారు. దీన్ని వరల్డ్ ఫేమస్ డిజైనర్​ ఫెర్నాండో అల్టామిరనొ డిజైన్​ చేయడం ఇంకో కారణం.