డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌ లో ముంబై రెండో విజయం

డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌ లో ముంబై రెండో విజయం

బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌ ముంబై ఇండియన్స్ డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌ లో వరుసగా రెండో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో దుమ్మురేపిన ముంబై ఈ సారి బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో మెరిసింది. అమేలియా కెర్ (4/17, 31) ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌కు తోడు  షబ్నిమ్ ఇస్లాయిల్ (3/18), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (46 నాటౌట్‌‌‌‌‌‌‌‌) చెలరేగడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ముంబై  5 వికెట్ల తేడాతో గుజరాత్‌‌‌‌‌‌‌‌ జెయింట్స్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. టాస్ ఓడిన గుజరాత్ జెయింట్స్‌‌‌‌‌‌‌‌ తొలుత 20 ఓవర్లలో 126/9 స్కోరు మాత్రమే చేసింది. కెప్టెన్ బెత్‌‌‌‌‌‌‌‌ మూనీ (24) రాణించినా..  ముంబై బౌలర్ల దెబ్బకు వేదా కృష్ణమూర్తి (0), హర్లీన్‌‌‌‌‌‌‌‌ డియోల్ (8), ఫోబె లిచ్​ఫీల్డ్ (7), హేమలత (3)  నిరాశ పరిచారు. చివర్లో కేథరిన్ బ్రైస్ (25 నాటౌట్), తనూజ కన్వార్ (28) పోరాటంతో స్కోరు 120 దాటింది.  అనంతరం ముంబై 18.1 ఓవర్లలోనే 129/5 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ఓపెనర్లు యాస్తిక భాటియా (7), హేలీ మాథ్యూస్ (7) ఫెయిలైనా సివర్ బ్రంట్‌‌‌‌‌‌‌‌ (22), కెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి హర్మన్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను కరిగించింది. కెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.