
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్పై రెజ్లర్ల ఆరోపణలు
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఏప్రిల్ 28న ఢిల్లీలోని కన్నౌట్ ప్యాలెస్ పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. ఆరుగురు రెజ్లర్లతో ఫస్ట్ ఎఫ్ఐఆర్, ఓ మైనర్ రెజ్లర్ తండ్రి కంప్లైంట్తో సెకండ్ ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. ఈ సందర్భంగా రెజర్లు అందరూ బ్రిజ్ భూషణ్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
లైంగిక వేధింపులు, ఛాతిని తాకడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, గట్టిగా పట్టుకోవడం, వెంబడించడం, భయపెట్టడం, బెదిరించడం చేశాడని రెజ్లర్లు ఆరోపించారు. పదేండ్లుగా ఇది జరుగుతున్నదని కంప్లైంట్లో తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో నమోదైన ఎఫ్ఐఆర్లలో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. కోరిక తీరిస్తే కెరీర్ సెట్ చేస్తానంటూ ప్రామిస్ చేసేవాడంటూ రెజ్లర్లు కంప్లైంట్లో పేర్కొన్నారు. డబ్ల్యూఎఫ్ఐ సెక్రటరీ వినోద్ తోమర్ పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఉంది.