రేపటి నుంచి యాదాద్రి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి యాదాద్రి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. స్వస్తివచనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు ఆలయ అర్చకులు. ఈనెల 13న  ఎదుర్కోలు, 14న స్వామివారి కళ్యాణం, 15న రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల్లో రోజుకు రెండు అవతారాల్లో  భక్తులకు దర్శనమివ్వనున్నారు స్వామివారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి రంగులు వేశారు. ఆలయ ప్రాంగణంలో లైటింగ్ ఏర్పాటు చేశారు.  భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్నిఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.

 

మరిన్ని వార్తల కోసం..

 

సినీ పరిశ్రమను ఏపీకి తరలించండి