యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. స్వస్తివచనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు ఆలయ అర్చకులు. ఈనెల 13న ఎదుర్కోలు, 14న స్వామివారి కళ్యాణం, 15న రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల్లో రోజుకు రెండు అవతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు స్వామివారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి రంగులు వేశారు. ఆలయ ప్రాంగణంలో లైటింగ్ ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్నిఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.
మరిన్ని వార్తల కోసం..