గ్రామ పెద్దల జోక్యంతో తల్లిని చేరదీసిన కొడుకులు

గ్రామ పెద్దల జోక్యంతో తల్లిని చేరదీసిన కొడుకులు

యాదాద్రి భువనగిరి : కన్నతల్లిని ఇంట్లో నుంచి గెట్టేసిన కొడుకులు..చివరకు పోలీసులు, గ్రామస్థుల జోక్యంతో తల్లిని చేరదీశారు. మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెంలో కన్నతల్లిని ఇంట్లోంచి గెంటేశారు ముగ్గురు కొడుకులు. ఐదురోజులుగా చెట్టు కిందనే బిక్కుబిక్కుమంటూ గడిపిన 80 ఏళ్ల వృద్ధురాలి విషయం మీడియాకు తెలిసింది. ముసలవ్వను పూర్తి వివరాలు అడుగగా.. తన భర్త సంపాదించిన 70 ఎకరాలను పంచుకుని, తనని ఇంట్లోంచి గెంటేశారని తెలిపింది. కోడళ్లు అన్నంపెట్టేవారు కాదని చెప్పింది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..పోలీసులకు విషయం తెలిసింది. గ్రామపెద్దల సమక్షంలో పుత్ర రత్నాలకు క్లాస్ పీకారు. చివరకు పోలీసులు, గ్రామపెద్దల జోక్యంతో తల్లిని ఇంట్లోకి చేర్చుకున్నారు కొడుకులు. అయితే..ఇలాంటి కొడుకులుంటే ఊరు చెడిపోతుందని వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు తెలిపారు గ్రామస్ధులు.