
కూకట్ పల్లి, వెలుగు: పెండ్లికి వెళ్లి, భార్యాభర్తలు మిస్సయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ రెండో రోడ్డు ఈడబ్ల్యూఎస్ 336లోని సెకండ్ఫ్లోర్లో సిద్ధాబత్తుల శ్రీనివాస్–శోభ దంపతులు నివసిస్తున్నారు. ఆదివారం ఉదయం10 గంటలకు బంధువుల పెండ్లికి వెళ్లారు.
తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. మధ్యాహ్నం సమయంలో శ్రీనివాస్తమ్ముడు, సోదరి ఫోన్చేస్తే ఇద్దరి ఫోన్లు స్విచ్ఆఫ్వచ్చాయి. దీంతో వారు ఎక్కడికి వెళ్లారన్నది తెలియడం లేదు. మిస్సింగ్కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.