యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి 7 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం ఆలయ సిబ్బంది హరిత టూరిజం హోటల్లో లెక్కించారు. కానుకల్లో రూ.67,13,089 నగదు, 58 గ్రాముల బంగారం, కిలో 450 గ్రాముల వెండి సమకూరిందని ఈవో గీతారెడ్డి చెప్పారు. భక్తులు జరిపించిన పలురకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా మంగళవారం ఆలయానికి రూ.16,84,057 ఆదాయం వచ్చింది.
రాజన్న హుండీ ఆదాయం 1.22 కోట్లు
వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వరస్వామి 25 రోజుల హుండీ ఆదాయం రూ. కోటి 22 లక్షలు వచ్చింది. ఆలయ ఓపెన్ స్లాబ్ లో ఈవో రమాదేవి పర్యవేక్షణలో మంగళవారం హుండీలను లెక్కించారు. రూ.కోటి 22 లక్షల 52 వేల 488 నగదు, 157 గ్రాముల బంగారం, 12 కిలోల 600 గ్రాముల వెండి సమకూరాయి.