నర్సన్న హుండీ ఆదాయం 68.55 లక్షలు

నర్సన్న హుండీ ఆదాయం 68.55 లక్షలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను మంగళవారం సిబ్బంది లెక్కించారు. 7 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల్లో రూ.68,55,927 నగదు, 96 గ్రాముల బంగారం, కిలో 200 గ్రాముల వెండి వచ్చాయని ఈవో గీతారెడ్డి చెప్పారు. విదేశీ కరెన్సీ అమెరికా డాలర్లు 426, యూఏఈ దిర్హామ్స్ 325,  సింగపూర్ డాలర్లు 6, ఆస్ట్రేలియా  డాలర్లు 10, కెనడా డాలర్లు 30 వచ్చాయి.ఆలయంలో మంగళవారం నిత్య పూజలు ఉదయం సుప్రభాతంతో మొదలై రాత్రి పవళింపుసేవతో ముగిశాయి. మరోవైపు కొండపైన ఉన్న హనుమాన్ టెంపుల్ లో అంజన్నకు అర్చకులు ఆకుపూజ వైభవంగా నిర్వహించారు. ఆంజనేయస్వామి విగ్రహానికి నాగవల్లి దళాలతో అర్చన చేసి, భక్తులకు ప్రసాద వితరణ చేశారు.