భక్తులతో నిండిన యాదగిరిగుట్ట ..నర్సన్నకు ఒక్కరోజే రూ. 26 లక్షల ఇన్‌‌కం

భక్తులతో నిండిన యాదగిరిగుట్ట ..నర్సన్నకు ఒక్కరోజే రూ. 26 లక్షల ఇన్‌‌కం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో నిండిపోయింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి రెండు గంటలు, స్పెషల్‌‌ దర్శనానికి అరగంట సమయం పట్టింది. 

ఆలయంలో నిర్వహించిన నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు జరిపించిన నిత్య పూజలు, కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.26,52,441 ఆదాయం వచ్చింది. ఇందులో ప్రసాద విక్రయం ద్వారా రూ.10,01,480, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.4,40,500, వీఐపీ దర్శనాల ద్వారా రూ.2.40 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.1,72,800 ఇన్‌‌కం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.