స్టార్ హీరో యశ్(Yash) కెరిర్ లో 19వ సినిమాగా టాక్సిక్ (Tixic) అనే మూవీ వస్తున్న విషయం తెలిసిందే. కేవీఎన్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) డైరెక్ట్ చేయబోతున్నారు.
భారీ స్థాయిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి క్రేజీ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. అదేంటంటే..ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ యశ్కి జోడిగా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. దీంతో లేటెస్ట్ గా ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ స్పందించింది.
టాక్సిక్ మూవీ కోసం మీ ఇంట్రెస్ట్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నటించే నటీనటుల విషయంలో కొన్ని రోజులుగా అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇలాంటి ఊహాగానాలను నమ్మొద్దని ప్రతిఒక్కరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. టాక్సిక్ మూవీకి సంబంధించిన నటీనటుల ఇప్పటికే దాదాపు పూర్తయింది. త్వరలోనే ఆఫీసియల్ గా అనౌన్స్ చేస్తాం.ఈ కథకు జీవం పోయడానికి చిత్ర బృందమంతా సిద్ధమవుతోంది. మా అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలని కోరుకుంటున్నాం’ అని మూవీ యూనిట్ వెల్లడించింది.
అయితే ఈ సినిమాలో యాష్ కి జోడీగా..కియారా అడ్వాణీ (Kiara Advani) అండ్ సలార్ మూవీ హిట్ తో మంచి ఊపులో ఉన్న శ్రుతిహాసన్(Shruti Haasan) పేర్లు వినిపించాయి. అంతేకాకుండా..సాయిపల్లవి, కరీనా కపూర్ల పేర్లు కూడా వినిపించాయి. ఇప్పటికే శృతి హాసన్ ఒప్పుకున్నట్లు కూడా టాక్ వినిపించింది. ఇక ప్రొడక్షన్ హౌస్ స్పందించడంతో ఈ వార్తలకు చెక్ పడింది.
రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. ఏప్రిల్ 10, 2025న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఈ వీడియోలో తెలిపారు. ఈ ఒక్క వీడియో సినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలను పెంచేసింది. మరి కేజీఎఫ్ తరువాత యశ్ నుండి వస్తున్న ఈ సినిమా ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియెస్ట్ చేస్తుందో చూడాలి.