మళ్ళీ తెరపైకి యాత్ర సీక్వెల్.. జగన్ పాత్ర కోసం బాలీవుడ్ యాక్టర్

మళ్ళీ తెరపైకి యాత్ర సీక్వెల్.. జగన్ పాత్ర కోసం బాలీవుడ్ యాక్టర్

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో దర్శకుడు మహి వి. రాఘవ్ తెరకెక్కించిన చిత్రం "యాత్ర". ఈ సినిమాలో మలయాళ నటుడు  మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. 2019లో వచ్చిన ఈ సినిమాకి మంచి ఆధారనే లభించింది. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే యాత్ర మూవీ సీక్వెల్ ఉంటుందని, ఈ సీక్వెల్ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్  మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) జీవితం ఆధారంగా ఉంటుందని తెలిపారు చిత్ర దర్శకుడు మహి వి. రాఘవ్. ఇక అప్పటినుండి యాత్ర2 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు  వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్ ఫాన్స్.

 తాజాగా ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు మహి వి. రాఘవ్.. 'యాత్ర 2' తప్పకుండా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి 'యాత్ర 2' గురించి ఎక్కువగా మాట్లాడలేను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిన వాస్తవ సంఘటలను తీసుకుని సినిమా చేయాలి? నటీనటులుగా ఎవరిని తీసుకోవాలి? కంటెంట్ ఏం ఉండాలి? వంటి అంశాల గురించి నాకు క్లారిటీ వచ్చిన తర్వాత మరింత మాట్లాడతాను. అయితే, ఒక్కటి మాత్రం చెప్పగలను... 'యాత్ర 2'లో నేను చెప్పాలి అనుకున్న కథ! తప్పకుండా చెప్పి తీరుతా'' అని లేటెస్ట్ ఇంటర్వ్యూలో మహి వి. రాఘవ్ పేర్కొన్నారు.

ఈ చిత్ర కథాంశంపై వినిపిస్తున్న సమాచారం మేరకు.. వైఎస్ఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ‘యాత్ర 2’ మొదలవుతుందట. ఆ సమయంలో జగన్ ఎలా ఉండేవారు..? తండ్రి మరణం తరువాత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు..? ఓ రాజకీయనాయకుడిగా ప్రజలకు ఎలా మెప్పించగలిగాడనే విషయాలతో ‘యాత్ర 2’ని తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో జగన్ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అప్పట్లో ‘రంగం’ ఫేమ్ నటుడు అజ్మల్ తీసుకుంటారనే వార్తలు వినిపించాయి. కానీ.. ఈ పాత్ర కోసం బాలీవుడ్ నటుడిని రంగంలోకి దింపుతున్నారట. ‘స్కామ్ 1992’లో ప్రధాన పాత్ర చేసిన ప్రతీక్ గాంధీని జగన్ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారట. ప్రతీక్ లో జగన్ పోలికలు ఉన్నాయని.. ఆయనైతే  ప్రాజెక్ట్ కు పాన్ ఇండియా అప్పీల్ వచ్చే ఛాన్స్ ఉందని ఫీక్స్ అయ్యారట మేకర్స్. ఇక ఈ సినిమా 2024 ఎన్నికల ముందు  ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది .