
ఎన్నికల సమయంలో తనపై కొన్ని మీడియా సంస్థలు చేసిన దుష్ప్రచారాన్ని చట్టపరంగానే ఎదుర్కొంటానని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్ అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చట్టాన్ని ఉల్లంఘించడం జన్మహక్కుగా భావించేవారికి ఎవరో ఒకరు గుణపాఠం చెప్పాలని అన్నారు.
కొన్ని ఛానళ్లు, దానికి సంబంధించిన వ్యక్తులు తనను వ్యక్తిగతంగా దూషించారని, అందుకు కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని అన్నారు. తనపై దుష్ప్రచారం చేసిన వాళ్లకు చట్టానికి ఉన్న పవరేంటో చూపిస్తానని, ఒక్కొక్కరిపై రూ.100కోట్ల చొప్పున పరువు నష్టం దావా వేస్తానని ఆయన అన్నారు.
ఈవీఎంల గురించి తీవ్ర విమర్శలు చేస్తున్న చంద్రబాబు.. గత ఎన్నికల్లో గెలిచింది ఈవిఎంల ద్వారానే అని ఈ సందర్భంగా పీవీపీ గుర్తు చేశారు.